- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తక్కువ జీపీఏ రావడంతో విద్యార్థి అదృశ్యం
దిశ, జహీరాబాద్ : మండలంలోని అర్జున్ నాయక్ తండా కి చెందిన జాటోత్ గణేష్ కుమారుడు జటోత్ పృథ్వీ నాయక్ (17) రెండు రోజులుగా కనిపిం చడంలేదు. దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు జహీరాబాద్ రూరల్ ఎస్ఐ ప్రసాద్ పేర్కొన్నారు. గత 30వ తేదీన టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి. పెద్దాపూర్ లోని ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో పదవ తరగతి చదివిన పృథ్వీకి 8.7 జీపీఏ వచ్చింది. ఇదిలా ఉండగా వారి కుటుంబ సభ్యులలో మిగతా పిల్లలకి 9 జీపీఏ కంటే ఎక్కువ గ్రేడింగ్ లు వచ్చాయి.
దీంతో మనస్థాపం చెంది మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఇంట్లో చెప్పకుండా బ్యాగు తీసుకుని ఎటో వెళ్లిపోయాడు. నిన్నటి నుంచి ఇప్పటివరకు ఇరుగు పొరుగు, బంధువులు వద్ద, చుట్టుపక్కల వెతికినా జాడ తెలియలేదు. దీంతో బాలుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు జహీరాబాద్ రూరల్ ఎస్ఐ పేర్కొన్నారు. సదరు బాలుడు కనిపిస్తే ఫోన్ నెం.8712656764 కు ఫోన్ చేసి జహీరాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని సూచించారు.