నీటమునిగిన వైకుంఠధామం... పాలకులపై ఆగ్రహం

by Dishanational1 |
నీటమునిగిన వైకుంఠధామం... పాలకులపై ఆగ్రహం
X

దిశ, బెజ్జంకి: ప్రభుత్వ సొమ్ము నీళ్లపాలైంది. ఆర్భాటంగా చేపట్టిన పనులు పనికిరాకుండా పోయింది. శిఖం భూమిలో శ్మశానవాటిక, డంపింగ్ షెడ్ నిర్మించడంతో నీట మునిగింది. పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని చీలాపూర్ పల్లి చెరువులో గతంలో వైకుంఠధామం, డంపింగ్ షెడ్డు నిర్మించారు. వర్షాలు సమృద్ధిగా కురియడంతో నీట మునిగింది. చుట్టూ నీరు చేరడంతో అక్కడికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో వైకుంఠధామం ఉన్నా ఇబ్బందులు పడుతూ వేరే ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించాల్సి వస్తున్నది. చెరువు నిండితే స్మశాన వాటిక, డంపింగ్ షెడ్డులో ఇలా వాడకంలో ఉండదని నీట మునిగుతుందని తెలిసినా పాలకులు, అధికారులు నిర్లక్ష్యంగా నిర్మించారని ప్రజలు మండిపడుతున్నారు.



Next Story

Most Viewed