బతికుండగానే శ్రద్ధాంజలి

by Disha Web Desk 15 |
బతికుండగానే  శ్రద్ధాంజలి
X

దిశ, మద్దూరు : ఓ యువతికి బతికుండగానే శ్రద్ధాంజలి ఘటిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటిని ఎవరు ఏర్పాటు చేశారో కానీ తెల్లవారేసరికి దర్శనమిచ్చాయి. అయితే వీటిని ఆమె తల్లిదండ్రులే ఏర్పాటు చేశారని స్థానికులు భావిస్తున్నారు. వివరాల్లోకి వెళితే దూల్మిట్ట మండలం బెక్కల్ గ్రామానికి చెందిన తౌటి స్రవంతి ముదిరాజ్ అదే గ్రామానికి చెందిన పులి వినయ్ మాదిగ ఇద్దరూ ప్రేమించుకొని తల్లిదండ్రులకు తెలియకుండా ఏప్రిల్ 28న పెళ్లి చేసుకున్నారు. దాంతో బుధవారం ఉదయం స్రవంతి ఫొటోతో శ్రద్ధాంజలి ఫ్లెక్సీలు గ్రామంలో దర్శనం ఇచ్చాయి. స్రవంతి తల్లి దండ్రులు ప్లెక్సీలు ఏర్పాటు చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Next Story