సీఎం సభకు భారీగా తరలి వెళ్లిన సదశివపేట పార్టీ శ్రేణులు

by Disha Web Desk 22 |
సీఎం సభకు భారీగా తరలి వెళ్లిన సదశివపేట పార్టీ శ్రేణులు
X

దిశ, సదాశివపేట: మెదక్ జిల్లాలో బుధవారం నిర్వహించిన సీఎం కేసీఆర్‌ సభకు సదాశివపేట నుంచి వేలాది మంది నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివెళ్లారు. మండల పరిధిలోని 30 గ్రామ పంచాయతీలతో పాటు అనుబంధ గ్రామాల నుంచి సొసైటీ చైర్మన్ రత్నాకర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పెద్దగొల్ల ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి ఆరిఫోద్దీన్, ఎంపీటీసీలు సత్యనారాయణ యాదవ్, సుధాకర్, సంతోష్ గౌడ్, సొసైటీ వైస్ చైర్మన్ పాండు నాయక్, మాజీ సర్పంచ్ మానయ్య, మాజీ ఎం.పి.టి.సి శివకుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాములు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed