హైకోర్టు ఉత్తర్వుల మేరకు ప్యారా నగర్ భూ సర్వే.. తహశీల్దార్

by Sumithra |
హైకోర్టు ఉత్తర్వుల మేరకు ప్యారా నగర్ భూ సర్వే.. తహశీల్దార్
X

దిశ, గుమ్మడిదల : హైకోర్టు ఉత్తర్వుల మేరకు గుమ్మడిదల మండలం, ప్యారానగర్ గ్రామంలో భూ సర్వే నిర్వహించనున్నట్లు మండల తహశీల్దార్ గంగాభవాని శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. తహశీల్దార్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఫిబ్రవరి 13, 2025న మండల సర్వేయర్ ఆధ్వర్యంలో భూ సర్వే చేపట్టనున్నారు. ఈ సర్వే నంబర్లు 2, 3, 4, 27, 29, 35, 36, 39, 40, 41, 44కి సంబంధించిన భూముల్లో సర్వే నిర్వహించనున్నారు. సంబంధిత భూస్వాములు, రైతులు, ఆసక్తిగల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ భూ సర్వేకు తప్పనిసరిగా హాజరు కావాల్సిందిగా తహశీల్దార్ విజ్ఞప్తి చేశారు.

Next Story

Most Viewed