- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
విద్యుత్ అధికారుల తీరు పై మున్సిపల్ కౌన్సిల్ ఆగ్రహం

దిశ, సిద్దిపేట అర్బన్ : హరితహారం మొక్కలను ఎలక్ట్రిసిటీ, కేబుల్ ఆపరేటర్లు యథేచ్ఛగా నరికి వేసిన ఘటనపై మున్సిపల్ వివరణ కోరగా విద్యుత్ అధికారులు ఇచ్చిన వివరణపై మున్సిపల్ కౌన్సిల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సిద్దిపేట మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సాధారణ సమావేశం మున్సిపల్ చైర్ పర్సన్ కడవేర్గు ముంజుల రాజనర్సు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు పారిశుధ్య సిబ్బందిని తరుచు మార్చడం వల్ల ఇబ్బంది కలుగుతుందని కౌన్సిల్ దృష్టికి తీసుకురాగా సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటానని మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ తెలిపారు. కొందరు బిల్లు కలెక్టర్ల తీరుపై కౌన్సిలర్లు అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ... వేసవి దృష్ట్యా పట్టణంలోని అన్ని చెట్లకు ప్రతిరోజు నీరు అందించాలన్నారు. దోమల నివారణ చర్యలు చేపట్టాలని శానిటేషన్ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ అధికారులు సమయపాలన పాటించాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.