- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
‘గాలి’కి మద్దతుగా ఎమ్మెల్యే ప్రచారం
దిశ,ఝరాసంగం : బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజా సంక్షేమం కోసం పాటుపడిందని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. గురువారం సాయంత్రం ఝరాసంగం మండలంలోని కృష్ణాపూర్, మచునూర్, బర్దిపూర్, పొట్టిపల్లి గ్రామాలలో జహీరాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. బర్దిపూర్ గ్రామంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మాణిక్ రావు మాట్లాడుతూ మాయమాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని, 24 గంటలు విద్యుత్ సరఫరా, వృద్ధులు, వితంతువుల కోసం ఆసరా పెన్షన్ అమలు చేసిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరిస్తుందన్నారు. జహీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ని భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్ కు పంపించేందుకు ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లా పని చేయాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంకటేశం, బర్దిపూర్, పొట్టి పల్లి ఎంపీటీసీ రాజు, నాయకులు బొగ్గుల సంగమేశ్వర్, ప్రభు పటేల్, శ్రీనివాస్ రెడ్డి, జగదీశ్వర్ పాటిల్, బాల్ రాజ్, చింత చెట్టు రాజు తదితరులు పాల్గొన్నారు.