మద్యం తాగి 77 సార్లు డయల్ 100 కి కాల్ చేసిన వ్యక్తి.. ఎట్టకేలకు పట్టుకున్న పోలీసులు

by Sumithra |
మద్యం తాగి 77 సార్లు డయల్ 100 కి కాల్ చేసిన వ్యక్తి.. ఎట్టకేలకు పట్టుకున్న పోలీసులు
X

దిశ, నారాయణఖేడ్ : మద్యం తాగి పని బాటలేకుండా తాగుడుకు బానిసై తిరుగుతున్న వ్యక్తి ఇష్టానుసారంగా తిరుగుతూ పోలీస్ 100 కాలుకు ఫోన్ చేసిన ముప్పుతిప్పలు పట్టిస్తున్నాడు. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం పెద్ద ముబారకపూర్ గ్రామానికి చెందిన నాయకిని సురేష్ తండ్రి నాయకిని సాయిలు, పేరెంట్స్ కి ఇద్దరు కొడుకులు పెద్ద కుమారుడు మొగులయ్య హైదరాబాదులో పనిచేసుకుంటూ జీవిస్తున్నాడు. చిన్న కుమారుడు నాయకిని సురేష్ మూడు సంవత్సరాల క్రితం కంగ్టి మండలం ధన్పూర్ గ్రామానికి చెందిన ఆమెతో వివాహం జరిగింది. ఆరు నెలల్లోనే రోజు తాగి తిరగడంతో విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి మద్యం తాగి జులాయి గా తిరుగుతున్నారు. పోలీస్ 77 సార్లు డయల్ కి కాల్ చేశారు. గత ఆరు నెలల నుంచి మద్యం మత్తులో 77 సార్లు పోలీస్ ఎమర్జెన్సీ నంబర్100కి కాల్ చేశాడు.

ప్రతిసారి పోలీసులకు ఫోన్ చేసి తప్పుడు అడ్రస్ తో ఇబ్బందులకు గురి చేసినాడు. ఎవరనేది చెప్పకుండా వలపు చాలా రోజుల నుంచి డయల్ కాల్ చేస్తున్నాడు. తప్పుడు సమాచారం ఇస్తూ ఇబ్బందులకు ఫోను చేసిన వెంటనే స్విచ్ ఆఫ్ చేయడం మళ్లీ ఫోన్ చేశారు. ఎవరనేది పోలీసులు ఆరు నెలల నుంచి నిఘా పెట్టారు. అతడు ప్రతిసారి ఊరి పేరు తప్పు చెబుతూ.. తన పేరు వేరుగా చెబుతూ.. తాను చనిపోతున్నారని బెదిరిస్తూ, భార్య కనిపించడం లేదని, తాను పెట్రోల్ పోసుకున్నానని ఈ విధంగా అబద్ధంతో తప్పించుకుంటూ తిరుగుతున్నారు. సురేష్ పై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఎవరైనా తాగి అనవసరంగా ఫోన్ కాల్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడితే చేస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు. ఏ సంవత్సరం లేకుండా మద్యం తాగి ఇష్టానుసారంగా 100కు కాల్ చేస్తే తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుని కేసునమోదు చేస్తామన్నారు.



Next Story