- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఇందుప్రియాల్లో వ్యక్తి సజీవ దహనం!
దిశ, దౌల్తాబాద్ : దౌల్తాబాద్ మండల పరిధిలోని ఇందుప్రియాల్ లో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అనుమాండ్ల కాడి వెంకటయ్య (42) అనుమానాస్పద స్థితిలో పూర్తిగా కాలిపోయి పడి ఉన్నాడు. ఇది గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంకటయ్య రెండు నెలల క్రితమే జైలు నుంచి విడుదలై గ్రామానికి వచ్చి నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో వెంకటయ్య భార్య స్వరూప వెంకటయ్యతో గొడవపడి తల్లిగారి ఇంటికి వెళ్ళిపోయింది. అప్పటినుంచి ఇంట్లో ఉంటున్న అల్లుడు, కూతురు కనకయ్య, రజీతలతో కలిసి నివాసం ఉంటున్నారు. ప్రతీ రోజు వీరికి గొడవలు జరుగుతుండగా, గురువారం వెంకటయ్య పూర్తిగా కాలిపోయి మృతిచెంది ఉన్నాడు. కాగా మృతుడు వెంకటయ్య గతంలో ఆయన అత్తని మానభంగం చేసిన కేసులో జైలుశిక్ష అనుభవించి, ఇటీవలే విడుదలయ్యాడు. ఈ విషయంలో కక్ష్య పెంచుకున్న వెంకటయ్య బావమరిది ఇంబడి శ్రీహరి హత్య చేసి ఉంటాడని, వెంకటయ్య అన్న ఐలయ్య అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతుడి కూతురు, అల్లుడు సైతం హత్యకు సహకరించి ఉంటారని ఫిర్యాదులో ఐలయ్య పేర్కొన్నాడు. ఈ విషయమై దౌల్తాబాద్ ఎస్ఐ చైతన్యకుమార్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.