రాహుల్ సభను విజయవంతం చేయండి

by Disha Web Desk 15 |
రాహుల్ సభను విజయవంతం చేయండి
X

దిశ, నర్సాపూర్ : మెదక్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 9న నర్సాపూర్ పట్టణంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యే సభను విజయవంతం చేయాలని మెదక్ జిల్లా పార్లమెంటు పరిశీలకుడు, కేరళ రాష్ట్ర చెంగునూరు ఎంపీ సురేష్ అన్నారు. మంగళవారం నర్సాపూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి రాజిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ లతో కలిసి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి దేశంలోని రాయి బరేలి, వాయినాడు ఎంత ముఖ్యమో మెదక్ పార్లమెంటు సీటు సైతం అంతే ముఖ్యమని, ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచి ఇందిరా గాంధీ ప్రధానమంత్రి అయ్యారని ఆయన అన్నారు.

బీసీ బిడ్డ నీలం మధు ముదిరాజ్ మెదక్ పార్లమెంటు నుంచి అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాడని పేర్కొన్నారు. 9న సాయంత్రం నాలుగు గంటలకు రాహుల్ గాంధీ సభ ప్రారంభమై ఐదున్నర గంటలకు తిరిగి వెళ్లిపోనున్నట్లు తెలిపారు. కావున మెదక్ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుంచి మూడు గంటల వరకు పెద్ద ఎత్తున ప్రజలు సభా స్థలికి చేరుకోవాలని కోరారు. రాష్ట్ర ఇన్చార్జి దీపా దాస్ మున్షి బుధవారం నర్సాపూర్ కు వచ్చి రాహుల్ గాంధీ సభ ఏర్పాట్లను పర్యవేక్షించనట్లు తెలిపారు. సమావేశంలో నిజాంబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేడం బాలకృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు గుర్రాల మల్లేష్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ గుప్తా, మణిదీప్, ఆంజనేయులు, హరీష్ వర్ధన్ తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed