జవాన్ మురళి నాయక్ సాహసం వృథా పోదు : మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు

by Sumithra |
జవాన్ మురళి నాయక్ సాహసం వృథా పోదు : మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : దేశ ప్రజలంతా ఐక్యంగా ఉండి, జవాన్ల కుటుంబాలకు అండగా నిలబడాలని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో భారత్ - పాకిస్తాన్ యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ మురళి నాయక్ చిత్రపటానికి మాజీ మంత్రి హరీష్ రావు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్లకు ప్రతి ఒక్కరూ రుణపడి ఉంటారని అన్నారు. జవాన్ మురళి నాయక్ చేసిన పోరాటం, చూపిన సాహసం వృధా కాదని, భారతదేశం ఖచ్చితంగా గొప్ప విజయం సాధిస్తుందని హరీష్ రావు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed