స్థల మార్పిడి కోసం బ్రతికున్న వ్యక్తికి డెత్ సర్టిఫికెట్

by Dishafeatures2 |
స్థల మార్పిడి కోసం బ్రతికున్న వ్యక్తికి డెత్ సర్టిఫికెట్
X

దిశ, తూప్రాన్: తూప్రాన్ మండలం వెంకటాయపల్లిలో దారుణం చేసుకుంది. గ్రామానికి చెందిన మల్లయ్య చనిపోయాడని తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి అతని పేరుపై ఉన్న భూమిని యాదయ్య అనే వ్యక్తిపై అధికారులు పట్ట మార్పిడి చేశారు. దీంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తహసిల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. బతికున్న వ్యక్తిని చంపేశారని, తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో మంది అన్యాయానికి గురవుతున్న విషయం అధికారులకు తెలిసిన ఇలాంటి పొరపాటు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Next Story