మాంసం విక్రయాల్లో పరిశుభ్రత పాటించాలి: చేర్యాల మున్సిపల్ చైర్ పర్సన్

by Kodari Anjali |

మున్సిపాలిటి పరిధిలోని మాంసం దుకాణాల యజమానులు తప్పనిసరిగా పశువైద్య శాఖ అధికారుల అనుమతి తోనే జంతు వధ చేయాలని మున్సిపల్ చైర్ పర్సన్ ముస్త్యాల అరుణ అన్నారు.

మాంసం విక్రయాల్లో పరిశుభ్రత పాటించాలి: చేర్యాల మున్సిపల్ చైర్ పర్సన్
X

దిశ, చేర్యాల: మున్సిపాలిటి పరిధిలోని మాంసం దుకాణాల యజమానులు తప్పనిసరిగా పశువైద్య శాఖ అధికారుల అనుమతి తోనే జంతు వధ చేయాలని మున్సిపల్ చైర్ పర్సన్ ముస్త్యాల అరుణ అన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌన్సిల్ సమావేశంలో చైర్ పర్సన్ మాట్లాడుతూ.. ట్రేడ్ లైసెన్స్ లేకుండా మాంసం దుకాణాలు నిర్వహించరాదని, పశు వైద్య శాఖ అధికారులచే ముద్ర పొందిన తర్వాతనే జంతువులను వధ చేయాలని అన్నారు. ప్రజా పరిరక్షణ, పరిశుభ్రత దృష్ట్యా మున్సిపల్ శివారులో ఉన్న పంప్ హౌస్ ప్రాంగణాన్ని వధశాలగ కొనసాగించుటకు కాన్సిల్ నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు, పశు వైద్య శాఖ అధికారులు, మాంసం దుకాణాల యజమానులు పాల్గొన్నారు.

Next Story