తీవ్ర ఉత్కంఠ.. లింగ నిర్ధారణ పరీక్షకు అఘోరి

by Aamani |
తీవ్ర ఉత్కంఠ.. లింగ నిర్ధారణ పరీక్షకు అఘోరి
X

దిశ, సంగారెడ్డి అర్బన్ : రాష్ట్రంలో సంచలనం రేపిన అఘోరి అలియా శ్రీనివాస్ అరెస్ట్ కేసు విచిత్రమైన మలుపులు తిరుగుతోంది. బుధవారం ఓ చీటింగ్ కేసులో అరెస్టు చేసిన రంగారెడ్డి పోలీసులు చేవెళ్ల కోర్టులో న్యాయ మూర్తి ఎదుట హాజరు పరిచిన విషయం తెలిసిందే. అక్కడ న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించగా అఘోరి శ్రీనివాస్ ను నేరుగా సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైలుకు మధ్యాహ్నం తరలించారు.

అయితే ఇక్కడ జైలు అధికారులకు అఘోరీను ఏ బారక్ లో ఉంచాలో అనే టెన్షన్ మొదలుకున్నది. అయితే లింగ నిర్ధారణ జరిగితే గాని ఇక్కడ ఉంచుకోలేమంటూ చెప్పడంతో తిరిగి అఘోరిని కోర్టుకు పంపించారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు డాక్టర్ల వైద్య పరీక్షల అనంతరం లింగ నిర్ధారణ జరగనుంది. ఆ రిపోర్టు ఆధారంగా నిందితురాలుగా ఉన్న అఘోరీ చంచల్ గూడ జైలుకు తరలిస్తారా, లేకపోతే ఇంకా ఎక్కడైనా మహిళా ఖైదీలు ఉన్న జైలుకు పంపిస్తారా అనేది సాయంత్రం వరకు క్లారిటీగా తెలిసే అవకాశం ఉన్నది.



Next Story

Most Viewed