సమిష్టి కృషితో ఎన్నికలు విజయవంతం : కలెక్టర్ రాహుల్ రాజ్

by Kalyani |
సమిష్టి కృషితో ఎన్నికలు విజయవంతం : కలెక్టర్ రాహుల్ రాజ్
X

దిశ, మెదక్ ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగియడం పట్ల జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హర్షం వ్యక్తం చేశారు. అందరి సమన్వయం, సమిష్టి కృషి వల్లనే జిల్లాలో ఎన్నికలు విజయవంతం అయ్యాయని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మార్చి 16 నుంచి మే 13వ తేదీ వరకు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల నిర్వహణలో జిల్లా ప్రజల సహాయ, సహకారాలు భాగస్వామ్యం మరువలేనిదని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా,

నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరిని ఆయన అభినందించారు. జిల్లాలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం చాలా సంతోషమని అన్నారు. పోలింగ్ సమయం ఉదయం 7 నుండి సాయంత్రం 6 ఎన్నికల క గంటల వరకే అయినప్పటికీ ఓటర్లు పెద్ద ఎత్తున ఎండలను సైతం లెక్కచేయక ఓటు హక్కు వినియోగించుకోవడంలో చైతన్యం చాటారని, అందువల్ల గత పార్లమెంటు ఎన్నికల కంటే దాదాపు 04 శాతం అధికంగా పోలింగ్ నమోదు జరిగిందని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగస్వాములైన అధికారులను, అనధికారులను, జిల్లా ప్రజలను, పాత్రికేయులను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అభినందించారు.

Next Story

Most Viewed