- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్ (Operation sindoor)
దిశ ఎఫెక్ట్ : బోజ్యానాయక్ తండా సందర్శించిన ఎంపీడీవో

దిశ, ఝరాసంగం: ఝరాసంగం మండలంలోని భోజ్య నాయక్ తండా పై దిశ దినపత్రికలో శుక్రవారం "సమస్యల తిష్ట బోజ్యానాయక్ తండా" అనే శీర్షికకు జిల్లా అధికారులు స్పందించారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని ఝరాసంగం మండల అభివృద్ధి అధికారి సుధాకర్ ఆదేశించడంతో ఆయన తన సిబ్బందితో కలిసి బోజ్యానాయక్ పంచాయతీ పరిధిలోని పలు తండాలను సందర్శించారు. పూర్యా నాయక్ తండా, రామ్ చందర్ నాయక్ తండా, టోప్యా నాయక్ తండాల్లో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించారు.
బోరు మోటార్ మరమ్మత్తులు చేశారు. నూతనంగా మంచినీటి బోరుకు బోర్ నుంచి తండా వరకు పైప్లైన్ ఏర్పాటుపై అధికారులకు నివేదిక సమర్పిస్తానన్నారు. నీటి సరఫరా కోసం పైపులు ఇచ్చిన మహిళా రైతును ఆయన అభినందించారు. నీటి ట్యాంకర్ల వద్ద ఉన్న మురుగును తొలగించారు. రోడ్ల సమస్యపై అధికారులకు వివరిస్తానన్నారు. ఆయన వెంట ఏపీఓ రాజ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి అశోక్, పంచాయతీ సిబ్బంది ఉన్నారు. నీటి సమస్యను వెలుగులోకి తీసుకొచ్చిన "దిశ"ను గిరిజన తండా వాసులు అభినందించారు.