"రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ ముసలి కన్నీరు"

by Disha Web Desk 12 |
రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ ముసలి కన్నీరు
X

దిశ, హుస్నాబాద్: రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ ముసలి కన్నీరు కారుస్తూ గౌరవెల్లి ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నదని సిద్దిపేట జడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి అన్నారు. గురువారం హుస్నాబాద్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో గౌరవెల్లి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తే టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక బడ్జెట్‌లో నిధులు కేటాయించి ప్రాజెక్టు నిర్మాణం దాదాపు పూర్తి చేశామని అన్నారు. దాదాపు పనులు పూర్తయి నిర్వాసితులకు పరిహారం చెల్లించేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రతిపక్షాలు అడ్డుకోవడం, ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందకుండా కుట్రలు చేయడం విచారకరం అన్నారు.

కొండపోచమ్మ, రంగనాయక సాగర్ ప్రాజెక్టులతో పోలిస్తే గౌరవెల్లి నిర్వాసితులకు ఎక్కువ పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని గుర్తు చేశారు. ఎన్నో ఏళ్లుగా కరువు ప్రాంతంగా అల్లాడిన మెట్ట ప్రాంతానికి గోదావరి జలాలు తీసుకు వచ్చి సుమారు 50 వేల మంది రైతులకు, లక్ష ఎకరాలకు పైగా సాగునీరు రాకుండా అడ్డుకోవడం దారుణమైన విషయమని విమర్శించారు. గతంలోనూ నిర్వాసితులను రెచ్చగొట్టి గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్లి రైతులతో కేసులు వేయించి ప్రాజెక్ట్ ను అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. ఇలాంటి దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా గోదావరి జలాలతో గౌరవెల్లి ప్రాజెక్టులో నీటిని నింపడం ఖాయం అని తెలిపారు.



Next Story

Most Viewed