బ్రేకింగ్ న్యూస్.. మల్లన్న సాగర్ నీటి ఉదృతికి కుప్పకూలిన కూడవెళ్లి వంతెన

by Disha Web Desk 12 |
బ్రేకింగ్ న్యూస్.. మల్లన్న సాగర్ నీటి ఉదృతికి కుప్పకూలిన కూడవెళ్లి వంతెన
X

దిశ, అక్బర్‌పేట, భూంపల్లి: అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలోని కూడవెల్లి వంతెన పై శిథిలావస్థలో ఉన్న పాత బ్రిడ్జి కుప్పకూలిపోయింది. ఇటీవల మల్లన్న సాగర్ ప్రాజెక్టు నీటిని కూడా వెళ్లి వాగులోకి వదిలారు. దీంతో నీటి ఉధృతి అక్బర్ పేట వరకు చేరుకుంది. అక్బర్ పేట శివారులో ఉన్న బ్రిడ్జి నీటి ప్రవాహానికి కూలిపోవడంతో బ్రిడ్జి పైనుంచి ఉన్న మిషన్ భగీరథ పైప్ లైన్ ఒక్కసారిగా పగిలిపోయింది.

బ్రిడ్జి ఒక్కసారిగా కుప్ప కూలిపోయిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బ్రిడ్జి పై ఉన్న మిషన్ భగీరథ పైప్ లైన్ మరోసారి పగిలిపోయింది. భగీరథ నీటి పైప్ లైన్ పగిలిపోవడంతో నీరు పెద్ద ఎత్తున బయటికి విరజిమ్మాయి. వెంటనే గమనించిన స్థానికులు భగీరథ అధికారులకు తెలియజేశారు. భగీరథ నీటి పైప్ త్వరితగతిన మరమ్మత్తులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.



Next Story