- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
దేశ సేవలో మట్టి బిడ్డలు.. సరిహద్దులో మన సైనికులు

దిశ, ఝరాసంగం : దేశంలో అందరి నోట యుద్ధం మాటే వినిపిస్తుంది. దేశ రక్షణ, సైనికుల సంక్షేమం కోసం ఝరాసంగం మండలం బర్దిపూర్ దత్తక్షేత్రంలో 41 రోజుల పాటు మహా రుద్ర యజ్ఞం కొనసాగుతుంది. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాలతో వివిధ ఆలయాల్లో ఇప్పటికే ప్రత్యేక పూజలు అర్చనలు చేశారు. పహల్గాం ఉగ్రదాడితో దేశం మొత్తం నిరసనలు వెల్లువెత్తాయి. ప్రతి దాడి చేయాలంటూ దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు పలువురు రాజకీయ పార్టీల నాయకులు రగిలిపోయారు. దీంతో భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాల పై దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయినా పాక్ తన వంకర బుద్ధిని మానుకోవడం లేదు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలానికి చెందిన పలువురు యువకులు దేశం కోసం సైన్యంలో చేరి సేవలందించడం పై ఆయా గ్రామాలకు చెందిన వారి తల్లిదండ్రులు గర్విస్తున్నారు. బర్దిపూర్, పొట్టి పల్లి గ్రామానికి చెందిన ఆవిటి ప్రశాంత్, సాగర్ ఇద్దరు స్నేహితులు ఒకేసారి అగ్నిపత్ లో ఎంపికై దేశానికి సేవలందిస్తున్నారు. అదేవిధంగా కుప్పానగర్ గ్రామానికి చెందిన సూర్య తేజ 2020 నుంచి ఆర్మీలో సేవలను చేస్తున్నారు.
దేశానికి సేవ చేయడం గర్విస్తున్నాం.. ప్రశాంత్ తల్లిదండ్రులు..
ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామానికి చెందిన ప్రశాంత్ తల్లిదండ్రులు ఓ చిన్న టీ కొట్టు నడుపుతూ కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నాడు. ఒకే ఒక్క కుమారుడు ఉన్నప్పటికీ దేశ సేవ చేయడం తనకిష్టమని ఎనిమిది నెలల పాటు శిక్షణ పొంది ఏడాది క్రితమే అగ్నిపత్ లో చేరి దేశానికి సేవలందిస్తున్నాడు.
దేశభక్తిని చాటుతూ..
ఝరాసంగం మండలం పొట్టి పల్లి గ్రామానికి చెందిన మల్లమ్మ శరణప్ప దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. రెండో కుమారుడైన సాగర్ ను దేశ సేవ కోసం పంపించారు. తల్లిదండ్రులకు వ్యవసాయమే జీవనాధారం. దేశానికి సేవ చేయడం గర్వంగా ఉందని సాగర్ తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. మిగతా ఇద్దరు కుమారుల్లో పెద్దవాడు వ్యవసాయం, చిన్నవాడు పాలిటెక్నిక్ చదువుతున్నాడని చెప్పారు. తమ కుటుంబంలో ఒకరు జవాన్ మరొకడు కిసాన్ ఉన్నట్లు వారి పేర్కొన్నారు.
కుప్పానగర్ నుంచి ఒకే ఒక్కడు..
ఝరాసంగం మండలం కుప్పానగర్ గ్రామానికి చెందిన సూర్యా తేజ బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసి ఆర్మీలోని ఉద్యోగంలో 2020 చేరాడు. ఈయనకు ఒక అన్న ఒక తమ్ముడు ఉన్నారు. గ్రామం నుంచి ఇప్పటి వరకు ఒకే ఒక్కడు దేశ సేవకు వెళ్లడంతో గ్రామస్తులు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఆనందం వ్యక్తం చేశారు. వీరిది వ్యవసాయ ఆధారిత కుటుంబమే.