సమాజంలో మార్పు వస్తేనే కుల వివక్షత రూపుమాపుతుంది : నిర్మల జగ్గారెడ్డి

by Kalyani |
సమాజంలో మార్పు వస్తేనే కుల వివక్షత రూపుమాపుతుంది  : నిర్మల జగ్గారెడ్డి
X

దిశ, సంగారెడ్డి : సమాజంలో మార్పు వచ్చినప్పుడే కులవివక్షత రూపుమాసిపోతుందని దీనిని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ఇండస్ట్రియల్ చైర్ నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. శ్రీ మహత్మా బసవేశ్వరుని 892 జయంతోత్సవం సందర్భంగా బుధవారం నిర్మలా జగ్గారెడ్డి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, జిల్లా అదనపు కలెక్టర్ బి. చంద్రశేఖర్ వివిధ ప్రజా సంఘాల నాయకులు బైపాస్ రోడ్డులో గల బసవేశ్వరుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహాత్మ బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ.. సమాజ సేవ కోసం అహర్నిశలు పాటుపడినటు వంటి వ్యక్తి బసవేశ్వరుడన్నారు.

ఆయన ఆశయాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాలని, సమ సమాజ నిర్మాణానికి పాటుపడాలని కోరారు. వీరశైవ లింగాయత్ భవన నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, వీరశైవ లింగాయత్ గౌరవ జిల్లా అధ్యక్షుడు సిద్దేశ్వర్, జిల్లా రెవెన్యూ అధికారి రాధిక రమణి, టి.జి.ఓ జిల్లా అధ్యక్షుడు వైద్యనాథ్, నర్సింలు, రాజేశ్వర్, చంద్రశేఖర్, అరుణ, శారద మిగతా వీరశైవ లింగాయత్ సభ్యులు, యువజన సంఘాల అధ్యక్షుడు కూన వేణు, ముప్పరం ప్రకాశ్, కె.వి.పి.ఎస్ అధ్యక్షుడు అతిమేల మాణిక్యం, కల్లు గీత కార్మిక సంఘం కార్యదర్శి రమేశ్ గౌడ్, డి.వి.యమ్.సి మెంబర్ దుర్గాప్రసాద్ హ, మరియు బి.సి, సంఘం అధ్యక్షుడు ప్రభు గౌడ్, అనంతయ్య, రాంచంద్రయ్య, సంతోష్ పాటిల్, శివరాజ్ పాటిల్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జగదీష్ గారు, సహాయ వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి, భాగ్యలక్షి, జిల్లా వసతి గృహ సంక్షేమాధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.



Next Story

Most Viewed