- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
బీఆర్ఎస్ పాలనకు బాయ్.. బాయ్..!

దిశ, సిద్దిపేట ప్రతినిధి: సీఎం కేసీఆర్ కుటుంబ పాలనకు బాయ్ బాయ్ చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు అమరేందర్ సింగ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను ప్రజలకు తెలియ జేసేందుకు పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు అమరేందర్ సింగ్, పార్టీ నాయకులతో కలిసి సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రూ.500కు వంట గ్యాస్ సిలిండర్, 4వేల పెన్షన్, రైతులకు ఎకరాకు 15 వేల సాయం, ఇంటి నిర్మాణానికి రూ 5 లక్షలు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం మొదలగు నిర్ణయాలు సీడబ్ల్యూసీ సమావేశంలో తీసుకున్నామన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తూ అవినీతిలో కూరుకు పోయిందన్నారు. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, భూములు, మద్యం అమ్మితే తప్ప రాష్ట్రంలో పాలన కొనసాగించలేని పరిస్థితి నెలకొందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తాడూరి శ్రీనివాస్ గౌడ్, పూజల హరికృష్ణ, దరిపల్లి చంద్రం, సూర్య వర్మ, అత్తు ఇమామ్ తదితరులు పాల్గొన్నారు.
► Read More 2023 Telangana Legislative Assembly election News
► For Latest Government Job Notifications
► Follow us on Google News