- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మెదక్ ఎంపీగా దీవించి గెలిపించండి
దిశ,దుబ్బాక : పార్లమెంట్ ఎన్నికల్లో తనను మెదక్ ఎంపీగా గెలిపిస్తే, ప్రతి ఆరు నెలలకోసారి వివిధ కంపెనీలతో ఉద్యోగ మేళా నిర్వహిస్తానని కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. గురువారం అక్బర్పేట భూంపల్లిలోని ఎస్బీఆర్ వేడుక మందిరంలో నిర్వహించిన దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సన్నాహక సమావేశంలో మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, మెదక్ డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి, దుబ్బాక నియోజకవర్గ బాధ్యుడు చెరుకు శ్రీనివాస్రెడ్డితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకు ముందు భూంపల్లి కేంద్రం నుంచి కాంగ్రెస్ నాయకులంతా ఎడ్లబండిపై ర్యాలీగా వేడుక మందిరానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ బీసీ బిడ్డగా తనను ఆదరించి ఇందిరమ్మ గెలిచిన మెదక్ గడ్డపై ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, వారంలో ఒక రోజు దుబ్బాక నియోజకవర్గ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రజాపాలనలో భాగంగా గడిచిన నాలుగు నెలల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీల్లో నాలుగు అమలు పరిచామన్నారు. దేశంలో అందరిని సమానత్వంతో చూసే పార్టీ, కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టని పార్టీ, బడుగు,
బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం పాటు పడే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని పేర్కొన్నారు. అనంతరం మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చెరుకు ముత్యంరెడ్డి హయాంలో దుబ్బాక నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఎక్కడా జరగలేదన్నారు. గత పదేళ్ల కాలంలో భారాస నాయకులు విచ్చవిడిగా కుంభకోణాలు, అవినీతి చేసి సంపాందించిన డబ్బులతో ఎన్నికల్లో ఓటర్లకు పంచి గెలిచారని విమర్శించారు. నియోజకవర్గ ప్రజలు ఓటును రూ.500కు, రూ.100కు అమ్ముకొని భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని కోరారు.