- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
వచ్చే ఎన్నికల్లో BJP అధికారంలోకి రావడం ఖాయం: మాజీమంత్రి బాబుమోహన్
దిశ, అందోల్: వచ్చే ఎన్నికల్లో రాష్టంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే రాష్టం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ మంత్రి బాబుమోహన్ అన్నారు. ప్రజాగోస-బీజేపీ భరోసా యాత్రలో భాగంగా శుక్రవారం అందోల్ మండలంలోని పలు గ్రామాల్లో భైక్ ర్యాలీ నిర్వహించారు. జోగిపేటలో ప్రారంభమైన బైక్ ర్యాలీ అన్నాసాగర్, దానంపల్లి, రాంసాన్ పల్లి, ఎర్రారం, నేరడిగుంట గ్రామాల మీదుగా కన్ సాన్ పల్లి వరకు సాగింది. అనంతరం కన్ సాన్ పల్లిలో బీజేపీ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా బాబూమోహన్ మాట్లాడుతూ.. గడిచిన నాలుగేండ్లలో ఒక్క అభివృద్ధి పని జరుగలేదని అన్నారు.
ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే ప్రజాగోస బీజేపీ భరోసా యాత్రను నిర్వహిస్తుందన్నారు. ప్రజా సమస్యలు పట్టని ఈ అసమర్థ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో గద్దె దించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామపంచాయతీకి నిధులు జమ చేస్తున్నదని చెప్పారు. గ్రామాల్లో వీధి లైట్లు, వైకుంధామాలు, మరుగుదొడ్లు, రైతు వేదిక భవనాలతో ఇతరత్రా అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వమే నిధులను మంజూరు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సీనియర్ నాయకులు శ్రీనివాస్, జగన్నాథం, సాయి, రమేష్తో పాటు తదితరులు పాల్గొన్నారు.
రైతులను ఆప్యాయంగా పలకరిస్తూ..
ప్రజాగోస బీజేపీ భరోసా యాత్ర సందర్భంగా గ్రామాల్లో దారి పొడవునా వ్యవసాయ క్షేత్రాల్లో పని చేస్తున్న రైతులను ఆప్యాయంగా పలకరిస్తూ యాత్రను కొనసాగించారు. రైతు, కూలీల సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు, బీజేపీ రైతుల కోసం ప్రవేశపెట్టి అమలుచేస్తున్న పథకాలను వివరించారు. అదే విధంగా ఎరువులపై బీజేపీ అందిస్తున్న సబ్సిడీల వివరాలతో కూడిన కరపత్రాలను వారికి అందజేశారు.