భగత్ సింగ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలి

by Dishanational1 |
భగత్ సింగ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలి
X

దిశ, చేర్యాల: భగత్ సింగ్ జయంతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం తహశీల్దార్ షేక్ అరిఫాకు ఏఐఎస్ఎఫ్ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పుల్లని వేణు మాట్లాడుతూ.. మాతృభూమి విముక్తి కోసం, దేశ ప్రజల స్వేచ్ఛ కోసం బ్రిటీష్ పరిపాలనపై తిరుగుబాటు చేసిన షాహీద్ భగత్ సింగ్ జయంతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని, భరతమాత సంకెళ్ల విముక్తి కోసం భగత్ సింగ్ చేసిన వీరోచిత పోరాటాల అంశాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలని.. అదేవిధంగా భగత్ సింగ్ కు భారతరత్న అవార్డు ప్రకటించి భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ యాక్ట్ అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు భోగి మనోహర్, ఆత్మకూరి హరికృష్ణ, అశ్విని, శిరష, రచన, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed