స్కార్పియో వాహనం ఢీకొని గిరిజన మహిళ మృతి

by Disha Web Desk 12 |
స్కార్పియో వాహనం ఢీకొని గిరిజన మహిళ మృతి
X

దిశ, కౌడిపల్లి: నడుచుకుంటూ వెళ్తున్న ఓ గిరిజన మహిళను స్కార్పియో వాహనం ఢీకొనడంతో గిరిజన మహిళ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మండలంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ధర్మసాగర్ గేట్ తాండాకు చెందిన గమిని(65) టీ తాగడానికి హోటల్‌కు వచ్చి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో మెదక్ వైపు నుంచి నర్సాపూర్ వెళ్తున్న స్కార్పియో వాహనం బలంగా ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. విషయం తెలిసిన వెంటనే స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి భర్త మాన్య కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గమిని మృతితో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్ఐ రంజిత్ రెడ్డి తెలిపారు.

Next Story