చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

by Disha Web Desk 1 |
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
X

దిశ, మనోహరాబాద్: చేపల వేటకు వెళ్లి ఓ వ్యక్తి చెరువులో పడి మృతి చెందిన ఘటన శనివారం మనోహరాబాద్ లో చోటుచేసుకుంది. ఎస్సై సందీప్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన షేక్ ఫరీద్ 33 హమాలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం రాత్రి చేపలు పట్టేందుకు వెళ్లిన ఫరీద్ ఇంటికి తిరిగి రాలేదు. శనివారం గ్రామ శివారులో ఉన్న ఎల్లమ్మ చెరువులో ఫరీద్ శవమై తేలినట్లు గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story