- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
20.6 కేజీల గంజాయి, కారు స్వాధీనం

దిశ, సంగారెడ్డి : 20.6 కిలోల గంజాయిని ఎస్ టీఎఫ్ఏ టీమ్, ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం లక్ష్మీ బాయి అనే మహిళ వద్ద 20.6 కేజీల గంజాయిని తీసుకొని జాతీయ రహదారి 65 లో సంగారెడ్డి పోతిరెడ్డిపల్లిలోని పల్లవి అపార్ట్మెంట్ ప్రాంతంలో కారులో వెళ్తుండగా గంజాయిని, గంజాయి వ్యాపారం కొనసాగిస్తున్న జలీలోద్దీన్ సిద్దిఖి అహ్మమద్ హుస్సెన్ ఎస్ టీఎఫ్ఏ టీమ్ లీడర్ అంజి రెడ్డి, టీమ్ సిబ్బంది పట్టుకున్నారు. మహారాష్ట్ర జౌరంగబాద్లోని ఒక కంపెనీలో అపరేటర్గా పని చేసిన జలీలోద్దీన్ సిద్దిఖి అహ్మమద్ హుస్సెన్ వస్తున్న జీతం సరిపోవడం లేదని గంజాయి వ్యాపారంలోకి దిగాడు. రెండేళ్లుగా ఉద్యోగంతో పాటు గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. 2023లో ఒకమారు గంజాయి రవాణ చేస్తూ అబుల్లాపూరమెట్లో ఒకసారి పట్టుబడ్డాడని ఎస్ టీఎఫ్ఏ టీమ్ లీడర్ అంజిరెడ్డి తెలిపారు.
ఈ కేసులో జైలుకు కూడ వెళ్లి వచ్చాడని, సీలేరు నుంచి గంజాయిని తీసుకొని మహారాష్ట్రలోని పలుప్రాంతాల్లో అమ్మకాలు సాగిస్తూ ఉంటాడని, జైలుకు వెళ్లి వచ్చినా కూడా గంజాయి వ్యాపారం కొనసాగిస్తున్న జలీలోద్దీన్ సిద్దిఖి అహ్మమద్ హుస్సెన్ మరోమారు గంజాయిని తరలిస్తూ ఎస్ టి ఎఫ్ఏ టీమ్ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ కేసుల్లో గంజాయిని కొనుగోలు చేసి అమ్మకాల కోసం తీసుకు వెలుతున్న జలీలోద్దీన్ సిద్దిఖి అహ్మమద్ హుస్సెన్, గంజాయి అమ్మకాలు జరిపిన లక్ష్మీబాయి, కృష్ణ కొన అనేవ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పట్టుకున్న గంజాయి విలువ రూ.10 లక్షలు ఉందని తెలిపారు. కారు, గంజాయి, నిందితుడు జలీలోద్దీన్ సిద్దిఖి అహ్మమద్ హుస్సెన్ అరెస్టు చేసి సంగారెడ్డి ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు తెలిపారు.
మరో మూడు కేసుల్లో 3.315 కేజీల గంజాయి పట్టివేత..
సంగారెడ్డి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మూడు కేసులు నమోదు చేసి, 3.315 కేజీల గంజాయి ముగ్గురు వ్యక్తులను మూడు బైకులను స్వాధీనం చేసుకున్నామని సంగారెడ్డి ఎక్సైజ్ శాఖ సిబ్బందిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది తెలిపారు. 1.500 కేజీల గంజాయి కేసులో ఎస్సార్ నగర్ కు చెందినటువంటి సందీప్ ను అరెస్ట్ చేసి అతడి వద్ద ఉన్నటువంటి స్కూటీని సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా బీరం కొండకు చెందినటువంటి సాయికుమార్ శ్రీకాంత్ ల వద్ద 1.200 కేజీల గంజాయిని పట్టుకొని వారి వద్ద ఉన్నటువంటి బైకును రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో 615 గ్రాముల గంజాయిని పట్టుకున్నారు.
అతడి వద్ద ఉన్నటువంటి బైకును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ మూడు కేసుల్లో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి సంగారెడ్డి పోలీసులకు గంజాయితో పాటు అప్పగించారు. గంజాయి పట్టుకున్న వారిలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది వీణారెడ్డి, బి.గాంధీ, అనిల్, యాదయ్య, ప్రహ్లాద్, కరీం, యాదయ్య, గోపాల్, రామారావు, ఉమా, మల్కయ్య పాల్గొన్నారు. గంజాయిని పట్టుకున్న సంగారెడ్డి ఎక్సైజ్ శాఖ సిబ్బందిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం, మెదక్ జిల్లా డిప్యూటీ కమిషనర్ హరి కిషన్, అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిలు అభినందించారు.