- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మద్దిగట్లలో మహిళ దారుణ హత్య
దిశ, భూత్పూర్: మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం మద్దిగట్ల గ్రామంలో బీరమ్మ (45) అనే మహిళ హత్యకు గురైన సంఘటన గురువారం ఉదయం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. బీరమ్మ భర్త కొద్ది సంవత్సరాల క్రితం మరణించడంతో.. ఆమె తన కూతురు, కుమారుడి వివాహాలు చేసింది. కొడుకు, కోడలు జడ్చర్ల మండలంలో ఉంటున్నారు. ఒంటరిగా ఉంటున్న బీరమ్మ గత కొన్ని రోజులుగా కుమారుడు వద్ద ఉండి బుధవారం ఇంటికి చేరుకుంది. కుమారుడు రాత్రి తల్లికి ఫోన్ చేసినప్పటికీ ఆమె స్పందించకపోవడంతో.. అతడు పక్కింటి వాళ్లకు ఫోన్ చేసినట్లు సమాచారం.
రాత్రి సమయం కావడంతో పక్కింటి వాళ్లు కూడా ఫోన్కు సమాదానం ఇవ్వలేదు. గురువారం ఉదయం బీరమ్మ హత్యకు గురైనట్లు గమనించిన పక్కింటి వాళ్ళు ఆమె కుమారుడికి సమాచారం ఇచ్చిన అనంతరం.. పోలీసులకు కూడా విషయం చేరవేశారు. కాగా బీరమ్మ హత్యకు గురైన సమయంలో దుండగులను ప్రతిఘటించినట్లుగా ఆనవాళ్లు ఉన్నాయి. హత్య జరిగిన అనంతరం బీరమ్మ మృతదేహాన్ని కుర్చీలో కూర్చోబెట్టి దుండగులు పరారైనట్లు గుర్తించారు. భూత్పూర్ ఎస్సై భాస్కర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.