- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్ట పరుస్తాం : ఎమ్మెల్యే జీఎంఆర్

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి: గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్ట పరుస్తామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జీ.మధుసూదన్ రెడ్డి అన్నారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పార్టీ పరిశీలకులు సాంబయ్య, స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మెన్ ఒబెదుల్లా కొత్వాల్ లతో కలిసి మాట్లాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని విజయం వైపు నడిపించేందుకు బూత్ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు సమావేశాలను నిర్వహించి పార్టీని మరింత పటిష్ట పరుస్తామని ఆయన అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హమీలను అమలు పరచి సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేసినందుకు ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ, తమ ప్రభుత్వం ప్రకటించి, అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక విష ప్రచారం చేస్తూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం తమదేనని ధీమా వ్యక్తంచేశారు. అనంతరం పార్టీ పరిశీలకులు సాంబయ్య మాట్లాడుతూ గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో చేసిందేమీ లేకనే చెప్పుకోలేక పరాజయం పొందారని విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని, విద్యార్థులకు కాస్మోటిక్స్ చార్జీలు ఎందుకు పెంచలేదని,కుల గణన ఎందుకు చేపట్టలేదని ఆయన ప్రశ్నించారు. తమ 15 నెలల పాలనలో రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కుల గణన లాంటి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం తమదేనని ఘంటాపథంగా చెప్పారు. ఈ సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు వినోద్ కుమార్, సంజీవ్ ముదిరాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అనిత, పార్టీ పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్, మిథున్ రెడ్డి, సాయిబాబా, తదితరులు పాల్గొన్నారు.