ఆ టీచర్ ను సస్పెండ్ చేస్తేనే మేము భోజనం చేస్తాం

by Kalyani |   ( Updated:2025-04-15 09:10:07.0  )
ఆ టీచర్ ను సస్పెండ్ చేస్తేనే మేము భోజనం చేస్తాం
X

దిశ, నాగర్ కర్నూల్ : తమను అన్ని విధాల ఇబ్బందులకు గురి చేస్తున్న ఉపాధ్యాయురాలను సస్పెండ్ చేస్తేనే మేము భోజనం చేస్తాము అని.. నాగర్ కర్నూల్ జిల్లా నాగనూల్ కస్తూర్బా విద్యార్థినులు మంగళవారం ఆందోళనకు దిగారు. స్టడీ అవర్స్ కు ఆలస్యంగా వచ్చావని 9వ తరగతి విద్యార్థినికి ఇంగ్లీష్ టీచర్ మూడు గంటల పాటు పనిష్మెంట్ ఇవ్వడం.. ఈ విషయము మీడియాలో రావడంతో అధికారులు ఇటీవల విచారణ చేశారు. దీంతో ఉపాధ్యాయురాలు మాపై కక్ష పెట్టుకుని, తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపిస్తూ విద్యార్థులు మరోసారి ఆందోళన చేపట్టారు. ఆ ఉపాధ్యాయురాలను సస్పెండ్ చేసే వరకు మేం భోజనం చేసేదే లేదు అంటూ భీష్ముంచు కూర్చొని ఆందోళన చేస్తున్నారు. విద్యార్థులకు పలువురు నచ్చే చెప్పే ప్రయత్నం చేసిన వినకుండా వారు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు.

Next Story