- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మా తండా లో సన్న బియ్యం పంపిణీ చేయాలి

దిశ,మహబూబ్ నగర్ ప్రతినిధి: మహబూబ్ నగర్ గ్రామీణ మండలం వెంకటాపురం హామ్లెట్ (చిన్న తండా) గుట్టమీద తండా లో రేషన్ షాప్ ఏర్పాటు చేసి సన్న బియ్యం పంపిణీ చేయాలని తండా వాసులు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ని కోరారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారు వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రజా ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి తమ గుట్టమీద తండా లో కాకుండా, రేగడి గడ్డ తండా లో రేషన్ సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారని, బియ్యం మోసుకుంటూ మా తండాకు వెళ్ళాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమ గుట్టమీద తండా లోనే బియ్యం పంపిణీ చేయాలని వారు కోరగా, వెంటనే ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పందించి గుట్టమీద తండా లో రేషన్ బియ్యం పంపిణీ చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.