పూర్వ విద్యార్థుల 'అపూర్వ' సమ్మేళనం

by Sumithra |
పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
X

దిశ, నారాయణపేట ప్రతినిధి : ఆపదలో ఉన్న స్నేహితులను మనమంతా ఆదుకోవాల్సిన అవసరం ఉందని.. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఎప్పటికీ మరువబోమని పలువురు పూర్వవిద్యార్థులు అభిప్రాయపడ్డారు. జిల్లాకేంద్రంలోని దయానంద విద్యామందిర్ ఉన్నత పాఠశాలలో 2000 -2001 సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు 25 సంవత్సరాల తర్వాత రజతోత్సవంగా పూర్వవిద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని శనివారం పాఠశాలలో నిర్వహించి కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు తాజా పరిస్థితులను, కుటుంబ వివరాలను సభావేదికగా పంచుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన అధ్యాపకులను కార్యక్రమానికి ఆహ్వానించి పాఠశాలలో చదువుకునే సమయంలో జరిగిన విషయాలను గుర్తుచేసుకొని సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఆటపాటలతో విందు కార్యక్రమంతో గడిపి అధ్యాపకులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు, పూర్వవిద్యార్థులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed