బస్తాలు మీద పడి ఇద్దరు యువకులు మృతి

by Dishanational1 |
బస్తాలు మీద పడి ఇద్దరు యువకులు మృతి
X

దిశ, మక్తల్: వ్యవసాయ పొలం దగ్గర షెడ్డులో నిల్వ ఉంచిన బస్తాల పక్కన నిద్రిస్తున్న సుదాక‌ర్ రెడ్డి(25), నరేష్ గౌడ్(23) మీదపడి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మక్తల్ నియోజకవర్గంలోని మాగనూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవి సత్యారం గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.

ఇందుకు సంబంధించి కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం వ్యవసాయ పనులు కోసం ఎరువుల బస్తాలు పొలం దగ్గర షెడ్డులో నిల్వ ఉంచారు. అయితే, వాటి పక్కన నిద్రిస్తున్న ఇద్దరు యువకులు అవి మీద పడి అక్కడికక్కడే మృతిచెందారని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న మాగనూరు ఎస్సై, మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం మక్తల్ ఆస్పత్రికి తరలించారు.


Next Story

Most Viewed