- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
టీయూడబ్ల్యూజే ఐజేయూ నారాయణపేట జిల్లా శాఖ అండగా ఉంటుంది : కోయిలకొండ నారాయణరెడ్డి

దిశ, నారాయణపేట ప్రతినిధి: మృతి చెందిన జర్నలిస్ట్ కుటుంబాలకు ప్రభుత్వం తరఫున వచ్చే సంక్షేమ ఫలాలను అందించేందుకు టీయూడబ్ల్యూజే ఐజేయు నారాయణపేట జిల్లా శాఖ అండగా ఉంటుందని యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోయిలకొండ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని మీడియా అకాడమీ ఆఫ్ తెలంగాణ భవన్లో జరిగిన జర్నలిస్టుల సంక్షేమం-ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యం అనే కార్యక్రమంలో నారాయణపేట జిల్లాకు చెందిన జర్నలిస్ట్ లు యాదగిరి మహేష్( 6 టీవీ) , రాఘవేందర్ ( ఏబీఎన్ ఛానల్) ల ఆకస్మిక మృతి పట్ల జర్నలిస్టు సంక్షేమ నిధి నుంచి మంజూరైన రూ. 1 లక్ష చెక్కును టీయుడబ్ల్యూజే (ఐజెయు) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్ నేతృత్వంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మృతి చెందిన జర్నలిస్ట్ కుటుంబాలకు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా చెక్కులను అందజేశారు. అలాగే విద్యార్థుల చదువు కోసం ప్రతి నెల రూ.1000, మృతుని భార్యకు ప్రతి నెల రూ. 3వేల పెన్షన్ అందించడం జరుగుతుందన్నారు.
నారాయణపేట జిల్లాలో జర్నలిస్టుల సంక్షేమం కోసం టీయుడబ్ల్యూజే ఐజేయూ ఎంతగానో దోహదపడుతుందని కోవిడ్ బారిన పడిన ఎంతోమంది డెస్క్, వర్కింగ్ జర్నలిస్ట్ లకు ఆర్థిక సహాయం ఇప్పించడం జరిగిందని, జిల్లా చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో సుమారు 230 మందికి పైగా జర్నలిస్టులతో జిల్లా ప్రథమ మహాసభను విజయం చేసి తమ సత్తాను ఋజువు చేశామన్నారు. మాగనూరుకు చెందిన విలేకరి వెంకటపతి కుటుంబానికి కూడా ఇప్పటికే ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు. ఇటీవల మృతి చెందిన ఉట్కూరు మండల ఉర్దూ రిపోర్టర్ కు సైతం వీలైనంత త్వరగా ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేస్తామన్నారు. అంతేకాకుండా ఈ నెల చివరి వరకు పేట జిల్లాకు చెందిన జర్నలిస్టులకు జర్నలిస్టు కుటుంబాలకు హెల్త్ క్యాంపు నిర్వహించబోతున్నామని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం తమ యూనియన్ ఎంతో కట్టుబడి ఉందని జర్నలిస్టుల సంక్షేమమే తమ ప్రథమ లక్ష్యమన్నారు. నారాయణపేట జిల్లా చరిత్రలో ప్రెస్ క్లబ్ తాత్కాలిక భవనం ఏర్పాటు చేసి జర్నలిస్టుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టామని అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రఘు గణప, నక్క శ్రీనివాస్, ఆకుల రాజేష్, సంజీవ ప్రకాష్, విఠోబా తదితరులు పాల్గొన్నారు.