నవాబుపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో చోరీ

by Disha Web Desk 11 |
నవాబుపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో చోరీ
X

దిశ, నవాబుపేట : మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం రాత్రి గుర్తుతెలియని దొంగలు చొరబడి చోరీకి పాల్పడినట్లు ఎస్సై పురుషోత్తం తెలిపారు. పాఠశాలలోని తొమ్మిదవ తరగతి గదిలో ఉన్న ఒక సీలింగ్ ఫ్యాన్, ఒక ఇన్వర్టర్, 6 బ్యాటరీలను దొంగలు దొంగిలించుకు పోయినట్లు పాఠశాల హెడ్మాస్టర్ వనజ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. దొంగిలించబడిన వస్తువుల విలువ సుమారు 60 వేల రూపాయలు ఉంటుందని ఆయన తెలిపారు.

Next Story