- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం :ఎమ్మెల్యే

దిశ,వలిగొండ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పాలన సాగిస్తుందని భువనగిరి శాసనసభ్యులు కుంభo అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక మార్కెట్ యార్డు లో ఈనెల 21న జరిగే మార్కెట్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు రానున్నందున సభ స్థలిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పేదల పక్షంగా నిరంతరం పాలన సాగిస్తుందని అన్నారు. వలిగొండ నుంచి కాటేపల్లి వరకు 36 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్డు నిర్మాణానికి ఈనెల 21న శంకుస్థాపన పనులు ప్రారంభించబడుతుందని అన్నారు .రేషన్ కార్డు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని లిస్టులో పేరు రానివారు నిరాశ చెందవద్దని అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందుతుందని అన్నారు.రైతు భరోసా కోసం భూ సర్వే చేయడం జరుగుతుందని వ్యవసాయ అనుకూలంగా ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా అందుతుందని అన్నారు. రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో సంవత్సరానికి 12,000 రూపాయలు అందించడం జరుగుతుందన్నారు. ఈనెల 21న రామన్నపేట వలిగొండ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తదితర ముఖ్య నాయకులు పాల్గొనబోతున్న కార్యక్రమాన్ని మండల రైతులు జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి,డిసిసి వైస్ ప్రెసిడెంట్ వాకిటి అనంతరెడ్డి,బీమా నాయక్,గరిసె రవి, తుమ్మల యుగేందర్ రెడ్డి,బత్తిని సహదేవ్,మత్స్యగిరి గుట్ట చైర్మన్ కొమ్మిరెడ్డి నరేష్ రెడ్డి బెలిదె నాగేశ్వర్,పబ్బు ఉపేందర్ బోస్,ఉలిపే మల్లేశం, ఈతాప రాములు, మామిడి నరేందర్ రెడ్డి, అయిటి పాముల రవీంద్ర, కొండూరు భాస్కర్, చిలుగూరి సత్తిరెడ్డి, అరూర్ నరసింహ, పాశం స్వామి,కాసుల వెంకన్న, కొండూరి సాయి, గూడూరు వెంకటరెడ్డి, వడ్డేమాన్ దేవేందర్, దయ్యాల శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.