ఏజెన్సీలో ‘సౌరగిరి’ వికాసం

by Aamani |
ఏజెన్సీలో ‘సౌరగిరి’ వికాసం
X

దిశ, అచ్చంపేట : పట్టణాలు.. ఇటు పల్లెలు.. మరోవైపు విద్యుత్​, సాగునీటి వనరులకు దూరంగా ఎక్కడో అడవిలో జీవిస్తున్న ఆదివాసీ గిరిజనుల జీవితాల్లో వెలుగులు రాబోతున్నాయి. అడవిలోనే పోడు భూములను సాగు చేసుకుంటూ, లాంతర్ల వెలుగులోనే గడుపుతూ బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటున్న వీరి ఆర్థిక స్వావలంబనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. వర్షాధారంపైనే ఆధారపడి సాగు చేసుకుంటున్న గిరిజనులకు సాగునీటితో పాటు విద్యుత్​ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.12,600 కోట్లతో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందిరా సౌర గిరిజల వికాసం పథకాన్ని తీసుకురాబోతున్నది. ఈ పథకాన్ని మే 18న నాగర్​ కర్నూల్​ జిల్లా అచ్చంపేటలో సీఎం రేవంత్​ రెడ్డి లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉన్నతాధికారుల సమీక్షలో వెల్లడించారు. ఈ పథకం ద్వారా ఏజెన్సీ గ్రామాల్లోని 6 లక్షల పోడు భూములకు సాగునీరందించనున్నారు. సుమారు రూ.2.10లక్షల మంది రైతులు లబ్ధిపొందనున్నారు.

రానున్న ఐదేండ్లలో ఆరు లక్షల ఎకరాలు సాగులోకి..

నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన రైతుల అభివృద్ధి కోసం రానున్న ఐదేళ్లలో రూ.12,600. కోట్లతో ఇందిరా సౌర గిరి జల వికాసం గిరిజన గుడాలు గ్రామాల్లో 2.10 లక్షల మంది రైతుల ఆరు లక్షల ఎకరాలకు సాగు నీటి వసతి కల్పించనున్నారు. దీంతో దశాబ్ధాల తరబడి పోడు భూముల సాగుకు కరెంటు కోసం ఎదురుచూస్తున్న గిరిజన రైతులకు ఇందిరా గిరి జలవికాసం అద్భుతమైన వరం లాంటిది.

మన్ననూర్ లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా...

జిల్లాలోని అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈనెల 18న అచ్చంపేట నియోజకవర్గం మన్ననూరు లో ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం ప్రారంభించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అధికారులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లపై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలోని ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇందిరా సౌర గిరి జల వికాసం పథకంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నత అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమానికి మంత్రులందరూ హాజరుకానున్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా

దేశంలో ఏకకాలంలో ఒకేసారి గిరిజనులకు ఆర్ వో ఎఫ్ ఆర్ చట్టం కింద కేటాయించిన భూములను సాగులోకి తీసుకొచ్చేందుకు, గిరిజనులను ఆర్థికంగా బలోపేతం చేసే క్రమంలో 2.10 లక్షల మంది గిరిజన రైతులకు ఆరు లక్షల భూములకు విద్యుత్, సాగునీరు సౌకర్యం ఏర్పాటు చేసే కార్యక్రమం దేశంలో ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా అమలు చేయలేదు. అలాంటి ఉన్నతమైన పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం చూస్తుంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీ గిరిజనుల అభ్యున్నతి, వారి ఆర్థిక స్వాలంబన పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గొప్ప పథకం అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అధికారుల యాక్షన్ ప్లాన్ ఇలా...

ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం సమర్థవంతంగా అమలు చేసేందుకు అధికారుల యాక్షన్ ప్లాన్ ఇలా ఉండబోతుంది. రానున్న ఐదు సంవత్సరాలలో రెండు లక్షల పది వేల మంది రైతులకు సంబంధించిన ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం అమలు చేయనున్నారు. రానున్న ఐదు సంవత్సరాలలో రెండు లక్షల పది వేల మంది రైతులకు సంబంధించిన ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం ఉపయోగపడుతుంది. ఈ పథకం అమలులో ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్లు, విద్యుత్తు, ఉద్యాన వన శాఖ అధికారుల పాత్ర కీలకంగా ఉండబోతుంది. పట్టాలు పొందిన గిరిజనుల గ్రామాలను ఎంపిక చేసి ఆ గ్రామాల్లోని భూముల్లో జల వనరుల లభ్యత కోసం జియాలజికల్ సర్వే, తదుపరి బోర్లు వేయడం, సోలార్ పంపు సెట్లు బిగించడం, ప్లాంటేషన్, డ్రిప్ ఏర్పాటు చేయించి గిరిజన రైతులు ఇబ్బందులు పడకుండా చూడబోతున్నారు.

ఇతర పంటలపై గిరిజనుల రైతులకు అవగాహన...

కేవలం వర్షాధార పంటలపై ఆధారపడకుండా గిరిజన రైతులు తమ పోడు భూములలో ప్రత్యామ్నాయ పంటలను పండించి ఆర్థికంగా బలపరుచుకునేందుకు అధికారులు ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యామ్నాయ పంటలైన అవకాడో, వెదురు, దానిమ్మ డ్రాగన్ ఫ్రూట్ అంజీర్ వంటి పంటలు గిరిజనులు సాగు చేసేందుకు కార్యచరణ రూపొందించుకొని గిరిజన రైతులకు అవగాహన కల్పించనున్నారు. పై పంటలు పండించే రాష్ట్రాలకు గిరిజన రైతులను అవగాహన టూర్ ఏర్పాటు చేయనున్నారు.

కనీసం మూడు సంవత్సరాలు..

పామాయిల్, వెదురు వంటి పంటలు చేతికి రావాలంటే కనీసం మూడు సం.రాల సమయం పడుతుందని, ఈలోపు గిరిజనులకు ఆదాయం సమకూరేందుకు అవసరమైన అంతర పంటల సాగును గుర్తించాలని ఉద్యానవన శాఖ అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. హిమాచల్ ప్రదేశ్​ లో న్యాచురల్ ఫామింగ్ ద్వారా ఆర్గానిక్ కూరగాయలను పండించి ఢిల్లీకి ఎగుమతి చేస్తున్న మాదిరిగా ఐటీడీఏ ప్రాజెక్టు పరిధిలోని ఏజెన్సీ ఏరియాల్లో ఇదే తరహాలో కూరగాయలను పండించి హైదరాబాద్ కు తరలించేలా రైతులు ఆర్థిక ఇబ్బందులను అధిగమించి గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వం బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది.

సీఎం పర్యటనకు ఏర్పాటు చేయాలి : డిప్యూటీ సీఎం

ఏజెన్సీ గ్రామాల్లో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెడుతున్న ఇందిరా సౌర గిరిజల వికాసం పథకం ప్రారంభానికి ఈ నెల 18న సీఎం రేవంత్​ రెడ్డి అచ్చంపేటకు రానున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నతాధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్​ లోని అంబేడ్కర్​ భవనంలో సంబంధిత శాఖ​ల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అలాగే పథకం వివరాలను వెల్లడించారు.



Next Story

Most Viewed