గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి : కలెక్టర్‌

by Naveena |
గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి : కలెక్టర్‌
X

దిశ, గద్వాల కలెక్టరేట్ : గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసి సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై కలెక్టర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఆయా శాఖల వారీగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా వేడుకలు సజావుగా జరిగేలా ఆయా శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో వేడుకలు నిర్వహించనున్నందున అందుకనుగుణంగా వేదిక, సీటింగ్ ఏర్పాట్లను పక్కాగా చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా స్టాల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రొటోకాల్ ను అనుసరిస్తూ అతిథులకు ఆహ్వానాలు పంపాలని సూచించారు. జాతీయ భావన పెంపొందేలా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చికిత్స అందించేలా వైద్య బృందాన్ని వేడుక స్థలం వద్ద అందుబాటులో ఉంచాలన్నారు. అన్ని శాఖల అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ.. వేడుకలు విజయవంతం అయ్యేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు లక్ష్మినారాయణ, నర్సింగరావు, ఆర్డిఓ శ్రీనివాసరావు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed