- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఇందిరమ్మ ఇదేమి న్యాయమమ్మ...!

దిశ, అలంపూర్ : రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకొని సహాయం చేయాలని కోరుతుంది ఓ కుటుంబం. వివరాల్లోకి వెళితే జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలోని పల్లెపాడు గ్రామానికి చెందిన రాముడు~సువేదమ్మకు ఐదుగురు సంతానం. అందరూ ఆడపిల్లలే. ఉండటానికి సరైన గూడు లేదు. చిన్నపాటి రేకుల షెడ్డులో జీవనం సాగిస్తున్నారు. చాలిచాలని స్థితిలో జీవనం సాగిస్తూ ఐదుగురు అమ్మాయిలను చదివిస్తున్నాడు. కాంగ్రెస్ సర్కార్ నిరుపేదలకు ఇందిరమ్మ గృహం మంజూరు చేస్తుందని నమ్మకంతో దరఖాస్తు చేసుకుంటే ఇక్కడున్న రాజకీయ నాయకులు, మండల అధికారుల నిర్లక్ష్యంతో ఇందిరమ్మ గృహం మంజూరు కాలేదని, నా పరిస్థితిని నేరుగా పరిశీలించైనా గృహం మంజూరు చేయాలని కోరుతున్నాడు.
గతంలో ఏ ప్రభుత్వం తనను ఆదుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వమైన ఆదుకుంటుందని నమ్మకంతో దరఖాస్తు చేసుకుంటే చేదు అనుభవం మిగిల్చిందని దిశ న్యూస్ తో వాపోయాడు. ఐదు మంది అమ్మాయిలతో చిన్న గుడిసెలో జీవనం చేస్తున్న అధికారులకు కనిపించదా అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇండ్లు ఉన్నవారికి మాత్రం ఒకటి నుండి మూడు చొప్పున ఇండ్లు మంజూరు చేశారని, మాలాంటి నిరుపేద కుటుంబాలకు ఇండ్లు మంజూరు కాలేదని వాపోయాడు. జిల్లా కలెక్టర్, కాంగ్రెస్ సర్కార్ తనను ఆదుకోవాలని కోరుతున్నాడు. నేటి వరకు ప్రభుత్వం నుండి ఏ ఒక్క పథకం కూడా తనకు లభించలేదని దీనంగా వేడుకుంటున్నాడు.