పార్కులతో మానసిక ప్రశాంతత చేకూరుతుంది : మహబూబ్ నగర్ ఎమ్మెల్యే

by Aamani |
పార్కులతో మానసిక ప్రశాంతత చేకూరుతుంది : మహబూబ్ నగర్ ఎమ్మెల్యే
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: ప్రతి కాలనీలో వీధికో పార్క్ తప్పనిసరిగా ఉండాలని,పార్కుల్లో గడిపితే మానసిక ప్రశాంతత చేకూరుతుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.పట్టణంలోని అప్పన్నపల్లి మూడవ వార్డు ఆర్వోబీ క్రింద 38 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న పార్క్ నిర్మాణానికి ఆయన శనివారం శంకుస్థాపన చేసి మాట్లాడారు.పట్టణంలో మరిన్ని పార్క్ లను ఏర్పాటు చేసుకుంటూ,పట్టణాభివృద్ధి చేసుకోవాల్సిన అవసరముందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్,వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్,ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్,మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత,సిరాజ్ ఖాద్రీ,మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి,కౌన్సిలర్లు రామాంజనేయులు,ఖాజా పాషా,రాషెద్ ఖాన్,తిరుమల వెంకటేష్,అజ్మత్ అలీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed