- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కాంగ్రెస్కు బిగ్ షాక్.. బీజేపీలో చేరనున్న మరో నేత
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎన్పీ వెంకటేష్ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. టీడీపీ ఆవిర్భావం నుండి దీర్ఘ కాలం పాటు ఆ పార్టీలో కొనసాగి.. నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలను నిర్వహించారు. తెలంగాణలో టీడీపీ పరిస్థితి దెబ్బతినడంతో 2017వ సంవత్సరంలో వెంకటేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. న్యాయవాదిగా, మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్య నాయకులలో ఒకరిగా కొనసాగుతూ వచ్చారు. గత రెండు సంవత్సరాలుగా రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలు, కారణాలవల్ల ఆయన భారతీయ జనతా పార్టీలో చేరుతారని ప్రచారం జరిగింది.
దీనికి తోడు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తదితరులు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. విషయం తెలుసుకున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి పార్టీ మారకూడదని విజ్ఞప్తి చేయడంతో.. వేచి చూసే ధోరణిని అవలంబిస్తూ వచ్చారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులు మెరుగుపడే పరిస్థితులు లేకపోవడం, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తాను పోటీ చేయడానికి అవకాశం లభిస్తుంది అన్న ఆశలు కూడా లేకపోవడంతో.. ఆయన పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈనెల 21న మునుగోడులో జరగనున్న బహిరంగ సభలో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. ఈ విషయమై దిశ వెంకటేష్ను సంప్రదించగా భారతీయ జనతా పార్టీలో చేరుతున్న విషయం నిజమేనని ధృవీకరించారు.