రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ పై వేటు

by Disha Web Desk 15 |
రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ పై వేటు
X

దిశ, నారాయణపేట ప్రతినిధి : నారాయణపేట రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ పద్మజారాణి తీరు పట్ల అసంతృప్తి ఉండడంతో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆమెను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ మహిళా అధికారి తన నివాసాన్ని సైతం ఖాళీ చేసి వెళ్లినట్లు తెలుస్తోంది. నారాయణపేట లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ గా కె.చంద్రారెడ్డి, రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ గా పద్మజారాణి గతంలో కొనసాగారు. లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ కె.చంద్రారెడ్డి బదిలీ కాగా ఈయన స్థానంలో 2020 బ్యాచ్ ఐఏఎస్ అధికారి మయాంక్ మిత్తల్ వచ్చి విధుల్లో చేరారు. కాగా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ గా కొనసాగుతున్న పద్మజారాణి ని గత కొద్ది రోజుల క్రితం జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి సరెండర్ చేయగా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ పోస్ట్ ప్రస్తుతం జిల్లాలో ఖాళీగా ఉంది.



Next Story