పీ‌ఈ‌సెట్‌ ఫలితాల్లో నల్లమల్ల విద్యార్థి ప్రతిభ.. రాష్ట్రస్థాయిలో 2 ర్యాంకు

by Disha Web Desk 12 |
పీ‌ఈ‌సెట్‌ ఫలితాల్లో నల్లమల్ల విద్యార్థి ప్రతిభ.. రాష్ట్రస్థాయిలో 2 ర్యాంకు
X

దిశ, అచ్చంపేట: తెలంగాణ ఫిజి‌కల్‌ ఎడ్యు‌కే‌షన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పీ‌ఈ‌సెట్‌) 2022 శనివారం విడుదలైన ఫలితాల్లో నల్లమల ప్రాంతంలోని నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలం చిట్లంకుంట గ్రామానికి చెందిన మూడవత్ రాములు నాయక్ కుమారుడు శ్రీకాంత్ నాయక్ పీఈసెట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 2వ ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం శ్రీకాంత్ వరంగల్ జిల్లాలోని హనుమకొండ అథ్లెటిక్స్ క్రీడా అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు.

ఇటీవల డిగ్రీ పూర్తి చేసి, పీఈసెట్ ఎంట్రన్స్ టెస్టులో అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో 2వ ర్యాంక్ సాధించినట్లు శ్రీకాంత్ తెలిపాడు. ప్రస్తుతం శ్రీకాంత్ అక్కడే శిక్షణ పొందుతూ అథ్లెటిక్స్‌లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు కూడా సాధించాడు. శ్రీకాంత్ ఎంపిక పట్ల నాగర్ కర్నూల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ సోలా పోగుల స్వాములు, జాయింట్ సెక్రటరీ పరశురాముడు, కోశాధికారి శ్రీను యాదవ్, అథ్లెటిక్ కోచ్ బిక్షపతి యాదవ్, నల్లమల్ల ప్రజలు, తదితరులు అభినందించారు.


Next Story