శ్రీశైలంలో లోయలో పడబోయిన ఆర్టీసీ బస్సు.. తప్పిన పెను ప్రమాదం

by Disha Web Desk 13 |
శ్రీశైలంలో లోయలో పడబోయిన ఆర్టీసీ బస్సు.. తప్పిన పెను ప్రమాదం
X

దిశ, అచ్చంపేట: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలోకి పడబోయింది. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా శ్రీశైలం ప్రాజెక్టు కుడిగట్టు ఘాటు రోడ్డుపై మలుపు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం.. మహబూబ్ నగర్ డిపో బస్సుకు చెందిన బస్సు నెంబర్ TS 06 UD 0376.. శ్రీశైలం నుంచి బస్సు తిరిగి వస్తుండగా ప్రాజెక్టు సమీపంలో ఘాట్ రోడ్డుపై అదుపుతప్పిందని.. ఈ నేపథ్యంలో ఘాట్ రోడ్డుపై రక్షణగా ఏర్పాటు చేసిన గోడను మలుపు వద్ద బస్సు ఢీ కొట్టిందన్నారు.


ఆ క్రమంలో బస్సును అదుపు చేసేందుకు డ్రైవర్ ప్రయత్నం చేసినప్పటికీ.. అనుకోకుండా రక్షణ గోడకు ముందు భాగంలో ఏర్పాటు చేసిన ఇనుప రాడ్లు లోయలోకి పడిపోకుండా కాపాడినట్లు తెలిపారు. అదే క్రమంలో బస్సు ఆగిపోయిందని వారు వాపోయారు. బస్సులో సుమారు 30 మందికి పైగా ఉన్నారని తెలిపారు. ఈ ప్రమాదం నుంచి బయటపడిన వారు బస్సు ఆగిన వెంటనే ప్రాణాలను అరచేతిలో పట్టుకుని పరుగులు తీశారు.


Next Story

Most Viewed