ఎమ్మెల్యే వస్తేనే తాళి కడతా..!

by Kalyani |
ఎమ్మెల్యే వస్తేనే తాళి కడతా..!
X

దిశ, నాగర్ కర్నూల్ : ఎమ్మెల్యే వస్తేనే తాళి కడతానని పెళ్ళికొడుకు మొండికేసి కూర్చున్న ఘటన నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ..కాంగ్రెస్ కార్యకర్త సాయి కుమార్ కు పెద్దకొత్తపల్లి మండలానికి చెందిన అనూష తో పెళ్లి నిశ్చయం అయింది. తెలకపల్లి లో శుక్రవారం ఉదయం 9.05 నిమిషాలకు ముహూర్తం ఫిక్స్ చేసుకొని అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ముహూర్తం టైం దగ్గరికి వచ్చింది. తాళి కట్టకుండా తన పెళ్లికి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి వస్తేనే తాళి కడతానని మొండికేసి కూర్చున్నాడు. దీంతో ఒక్కసారిగా అక్కడున్న బంధువులు షాక్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విషయం ఎమ్మెల్యేకి తెలపడంతో హుటాహుటిన పెళ్ళికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. తన అభిమాని, పార్టీ కార్యకర్త కోరిక మేరకు ఎమ్మెల్యే పెళ్లికి రావడం పట్ల స్థానిక గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రత్యేకంగా హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యేగా రాజేష్ రెడ్డి గెలిచినప్పుడు కూడా సాయికుమార్ మద్దిమడుగు ఆంజనేయ స్వామి ఆలయం వరకు పాదయాత్ర చేసి మొక్కు తీర్చినట్లు గ్రామస్తులు తెలిపారు.



Next Story