విద్యుత్ షాక్ తో ఇల్లు దగ్ధం.. భారీగా ఆస్తి నష్టం

by Kalyani |
విద్యుత్ షాక్ తో ఇల్లు దగ్ధం.. భారీగా ఆస్తి నష్టం
X

దిశ, గోపాల్ పేట: వనపర్తి జిల్లా గోపాల్పేట మండల పరిధిలోని చాకల్ పల్లి గ్రామంలో ఓ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మధ్య రాత్రి సమయంలో ఇంట్లో నుంచి మంటలు రావడంతో మిద్దె పై నిద్రిస్తున్న ఏడు మంది కుటుంబ సభ్యులను నిద్రలోంచి లేపి ప్రాణ నష్టం జరగకుండా కాపాడారు. తినడానికి తిండి లేకుండా కట్టడానికి బట్టలేకుండా మంటల్లో కాలిపోయాయి. రోజు రోజు పోగేసుకున్న డబ్బు ఆడపిల్లల పెళ్లిల కోసం 4 లక్షల నగదు, 6 తులాల బంగారు, 15 బియ్యం సంచులు, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ తయారు చేయించుకున్న బంగారం సొమ్ములు, ఇతర సామాను మొత్తం విలువ దాదాపుగా 14 లక్షలు కాళీ బూడిద అయిపోయాయని, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని రంగమ్మ ఏడుస్తున్న అందరికి కలిచివేసింది. చిన్న కిరాణం ఏర్పాటు చేసుకొని, వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వారు. రోజు లాగే గురువారం అన్నం తిని, వేసవి కాలం కావడంతో మిద్దెపై పడుకున్నారు. అంతలోనే ఈ సంఘటన జరగడంతో ప్రాణ నష్టం జరగలేదని ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఈ పేద కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కుటుంబ సభ్యులు గ్రామస్తులు కోరుతున్నారు.



Next Story

Most Viewed