- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > ప్రేమించి పెళ్లాడి.. ఆ తరువాత యువతి అలా చేసిందని పురుగుల మందు తాగిన యువకుడు..
ప్రేమించి పెళ్లాడి.. ఆ తరువాత యువతి అలా చేసిందని పురుగుల మందు తాగిన యువకుడు..
by Disha Web Desk 11 |
X
దిశ, లింగాల: నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం కొత్తకుంటపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని పది రోజుల క్రితం ఓ దేవలయంలో కొంతమంది మిత్రుల సహాయంతో ఫిబ్రవరి 2 వ తేదీన ప్రేమ వివాహం చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు మేం మీకు పెళ్లి చేస్తామని వారిద్దరిని పిలిపించి పెద్దల సమక్షంలో మీకు మళ్లీ పది రోజుల తర్వాత ఘనంగా పెళ్లి చేస్తామని అంగీకార పత్రం రాసుకున్నారు. పది రోజులు పూర్తి అయిన తర్వాత అమ్మాయి బంధువులు స్పందించకపోవడంతో తెలకపల్లి పోలీస్ స్టేషన్ లో యువకుడు ఆంజనేయులు ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు అందుకున్న ఎస్ఐ ఇరువురిని పిలిపించి పరిష్కార దిశలో మాట్లాడుకోవాలని తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో ఇరువురు అంగీకార పత్రంను రాసుకున్నట్లు బాధితుడు ఆంజనేయులు తెలిపాడు. పది రోజుల తర్వాత పెళ్లి చేస్తామని మీరే కదా అని పెద్దలను అబ్బాయి ఆంజనేయులు నిలదీశాడు. స్పందించిన పెద్దలు అమ్మాయి పెళ్లికి ఒప్పుకోవడం లేదని సమాధానం చెప్పారు. పది రోజుల్లో అమ్మాయిని భయబ్రాంతులకు గురిచేసి పెళ్లి చేసుకోనని అమ్మాయితో బలవంతంగా చెప్పించారని ఆరోపిస్తూ ప్రేమించిన అబ్బాయి ఆంజనేయులు అది జీర్ణించుకోలేక బుధవారం రాత్రి పురుగులమందు తాగాడు. పరిస్థితి గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటీన అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నా కుమారుడు ప్రేమ పెళ్లి చేసుకున్నాడని ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు కొట్టారని అబ్బాయి తల్లి వెంకటమ్మ చెప్పారు. దీనికి సంబంధించిన అధికారులు స్పందించి నా కొడుకుకు న్యాయం చేయాలని తల్లి మొరపెట్టుకుంటుంది.
Next Story