భార్య మరొకరిని కనడం లేదని ఇద్దరి పిల్లల గొంతుకోసిన తండ్రి.. ఆపై తానూ..

by Dishafeatures2 |
భార్య మరొకరిని కనడం లేదని ఇద్దరి పిల్లల గొంతుకోసిన తండ్రి.. ఆపై తానూ..
X

దిశ, నాగర్ కర్నూల్ / కొల్లాపూర్: నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్న జంట మధ్య కుటుంబ కలహాలు చిచ్చురేపాయి. ఇద్దరు మధ్య వచ్చిన మనస్పర్ధలకు వారి ప్రేమ గుర్తుగా జన్మించిన పిల్లలు బలయ్యారు. ఇద్దరు పిలల గొంతు కోసి హత్యచేసిన తండ్రి అనంతరం తానూ గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కొడేరు మండలం కుడికిళ్ల గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుడికిళ్ల గ్రామానికి చెందిన మొట్టే ఓంకార్(35) అదే గ్రామానికి చెందిన మహిళ శివలీను ప్రేమించి మూడో వివాహం చేసుకున్నాడు.

ఇద్దరి ప్రేమ గుర్తుగా చందన (3) విశ్వనాథం 9 నెలలు సంతానం జన్మించింది. కాగా ఓంకార్ మరో కాన్పు కావాలని భార్యపై ఒత్తిడి తెచ్చాడు. ఇప్పటికే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న తనకు అవకాశం లేదని వైద్యులు చెప్పినా అతడు వినలేదు. మరోసారి కుటుంబ నియంత్రణ తొలగించుకునెలా ఆపరేషన్ చేయించుకోవాలని భార్యపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాడు. ఈ నేపథ్యంలో ఇద్దరిమద్య అనుమానం, మనస్పర్థలు మొదలయ్యాయి. వాటితో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని స్థానికులు తెలిపారు.

కాగా బుధవారం మధ్యాహ్నం భార్య పిల్లలతో కలిసి బైక్‌పై కుడికిళ్ల నుండి ఎత్తం వైపు వెలుతుండగా మార్గమధ్యలో భార్య కోపంతో బైక్‌పై నుండి కిందికి దూకింది. అనంతరం డైల్ 100 ద్వారా తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె భర్తను సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా కనుక్కునేందుకు ప్రయత్నించారు. అంతలోనే అతడు ఘతుకానికి పాల్పడ్డాడు.

చిన్నారుల గొంతు కోసి తానూ గొంతు కోసుకుని మరణించారు. అప్పటికే ఇద్దరు చిన్నారులు మృతి చెందగా కొన ఊపిరితో ఉన్న తండ్రిని హుటాహుటిన పోలీసులు జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా ఓంకార్ మొదటి భార్య కృష్ణవేణి మరణించగా ఎత్తం గ్రామానికి చెందిన లక్ష్మిని రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి కూడా ఒక పాప, బాబు ఉన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.


Next Story