ఆత్మహత్య చేసుకున్న తల్లి, పిల్లల మృతదేహాలు లభ్యం..

by Dishafeatures2 |
ఆత్మహత్య చేసుకున్న తల్లి, పిల్లల మృతదేహాలు లభ్యం..
X

దిశ, నవాబుపేట: మండల పరిధిలోని కాకర్ల పహాడ్ గ్రామ సమీపంలోని నల్లకుంట చెరువులో శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న తల్లి, ఇద్దరు పిల్లల మృతదేహాలు ఆదివారం ఉదయం లభ్యమయ్యాయి. విగతజీవులుగా లభ్యమైన తల్లి రమాదేవి, పిల్లలు మారుతి, చందనల మృతదేహాలను చూసిన మృతుల కుటుంబీకులు బోరున విలపించారు. వారి మరణంపట్ల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులో లభ్యమైన మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మృతురాలు రమాదేవి బలవన్మరణానికి పాల్పడడానికి భార్యాభర్తల మధ్య జరిగిన గొడవనే కారణమై ఉండవచ్చని గ్రామస్తులు తెలిపారు. తను నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసిన చిన్నారులు తాను లేకుండా అనాధలుగా జీవించకూడదని భావించి, తనతో పాటు వారిని కూడా చెరువులోకి తీసుకెళ్లి వారు కూడా చనిపోయేలా చేసింది.

క్షణికావేశంలో ఆమె తీసుకున్న నిర్ణయం తాను మృతి చెందడంతో పాటు ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారుల పాలిట శాపంగా మారింది. ఈ విషయమై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్న పోలీసులు పలు కోణాల్లో విచారణ జరుపుతున్నారు. పోలీసుల విచారణలో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.


Next Story