- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కొడుకు చేతిలో తల్లి హతం.. మద్దిగట్ల మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు
దిశ, భూత్పూర్: మహబూబ్ నగర్ జిల్లా, భూత్పూర్ మండలం మద్దిగట్ల గ్రామంలో బుధవారం జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన సమాచారం మేరకు గ్రామానికి చెందిన బీరమ్మ(45) కు, కొత్తములగర గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం అయ్యింది. వారికి కుమారుడు, కూతురు జన్మించిన తర్వాత 20 సంవత్సరాల క్రితం భర్త హత్యకు గురయ్యాడు. దీంతో ఆమె పిల్లలను తీసుకొని తన తల్లి ఊరైన మద్ధి గట్లలో నివాసం ఉంటుంది. కూతురు, కుమారుడి వివాహాలు కూడా చేసింది. భర్త తరపున తనకు రావలసిన కొంత భూమి, ఇంటి స్థలాలు బీరమ్మ వాటాకు వచ్చాయి.
ఇటీవల పొలం అమ్మడంతో దాదాపుగా మూడు లక్షల రూపాయలకు పైగా ఆమెకు వచ్చాయి. వచ్చిన డబ్బులను ఆమె కొంతమందికి వడ్డీకి ఇచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో తన కుమారుడు బీరయ్య మామకు రూ. 50 వేలు అప్పుగా ఇచ్చినట్లు సమాచారం. ఆ రూ. 50 వేలు నేను వసూలు చేసుకుంటాను.. నాకు అవసరం ఉందని తల్లిని అడగడం, అందుకు ఆమె నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలిసింది. బుధవారం ముల్గల గ్రామంలో ఉన్న తమ ఇంటి స్థలాన్ని అమ్మడానికి అక్కడికి చేరుకొని.. తిరిగి తమ సొంత గ్రామమైన మద్దిగట్లకు చేరుకున్న బీరమ్మ మద్యం సేవించి ఇంటికి వెళ్లింది.
ఈ క్రమంలోనే మరోసారి తల్లి కొడుకుల మధ్య గొడవ జరిగినట్లు తెలిసింది. వచ్చిన డబ్బులను తల్లి తనకు ఇవ్వకుండా అనవసర ఖర్చులు చేస్తుందని, తల్లి వ్యవహార శైలిపై ఆగ్రహం తెచ్చుకున్నాడు కొడుకు. బీరమ్మ నోట్లో గుడ్డలు కుక్కి క్షణికావేశంలో రోకలి బండతో తలపై మోదడంతో ఆమె మరణించినట్లు పోలీసులు అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు ఎస్ఐ భాస్కర్ రెడ్డి కేసు నమోదు చేసుకొని క్లూస్ టీం సహకారంతో హత్యకు గల కారణాలను పూర్తి వివరాలతో సేకరిస్తున్నారు.